భార‌త‌దేశం

“నన్ను బతికించండి..” కన్నీళ్లు పెట్టిస్తున్న మెడికల్‌ ఆఫీసర్‌ చివరి మాటలు.. తీవ్ర విషాదం..

కోవిడ్‌ మహమ్మారి ఇప్పటికే ఎన్నో లక్షల మందిని పొట్టన పెట్టుకుంది. ఆత్మీయులను దూరం చేసింది. కన్నవాళ్లను, కుటుంబ సభ్యులను, స్నేహితులను పోగొట్టుకున్న ఎంతో మంది తీవ్ర విషాదంలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆ మెడికల్‌ ఆఫీసర్‌ మరణం కూడా తీవ్ర విషాదాన్ని నింపింది. ఏడాది కాలంగా ఎంతో మంది కోవిడ్‌ పేషెంట్లు రికవరీ అయ్యేందుకు ఆయన సహాయం చేశారు. కానీ చివరకు మాయదారి మహమ్మారి ఆయననూ బలి తీసుకుంది. తనపైనే ఆధార పడ్డ కుటుంబ సభ్యుల జీవితాలను ఆగం చేసింది.

ఢిల్లీలోని లోక్‌ నాయక్‌ హాస్పిటల్‌లో రాజ్‌ కుమార్‌ అగర్వాల్‌ (38) మెడికల్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. గతేడాది కరోనా మొదటి వేవ్‌ సమయంలో తీవ్రంగా శ్రమించాడు. ఇప్పుడు కోవిడ్‌ సెకండ్‌ వేవ్ కారణంగా మరోసారి అలుపెరగకుండా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇప్పటికే ఎంతో మంది కోవిడ్‌ రోగులను కోలుకుని ఇంటికి పంపించాడు. కానీ అతనికి, అతని భార్యకు ఏప్రిల్‌ 11వ తేదీన కరోనా సోకింది. దీంతో అతను కొన్ని రోజుల పాటు ఇంట్లోనే ఉండి కోవిడ్‌ చికిత్స తీసుకున్నాడు.

అయితే సడెన్‌గా రాజ్‌ కుమార్‌కు ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోవడంతో అతన్ని హాస్పిటల్‌లో చేర్పించారు. చేయాల్సిన చికిత్సను అంతా అందించారు. అయినప్పటికీ రాజ్‌ కుమార్‌ బతకలేదు. గత గురువారం ఉదయం 5 గంటలకు అతను మృతి చెందాడు. దీంతో అతని కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

రాజ్‌ కుమార్‌ భార్యకు కూడా కోవిడ్‌ పాజిటివ్‌ కావడంతో అతని ఇద్దరు పిల్లలను మరో కొలీగ్‌ చేరదీసి ఇంట్లో పెట్టుకున్నాడు. అయితే రాజ్‌ కుమార్‌ మరణించిన విషయం ఆ పిల్లలకు ఇంకా తెలియదు. వారు ఇప్పటికీ తమ నాన్న బతికే ఉన్నాడని, హాస్పిటల్‌లో ఉన్నాడని, తిరిగి వస్తాడని ఎదురు చూస్తున్నారు. ఆ కుటుంబంలో సంపాదించేది రాజ్‌ కుమార్‌ ఒక్కడే. దీంతో అతనిపై ఆధార పడ్డ భార్య పిల్లల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గతంలో అతను కొందరు స్నేహితులకు ఎంతగానో సహాయం చేశాడు. దీంతో వారు అతని కుటుంబానికి ఆర్థిక సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు.

అయితే రాజ్‌ కుమార్‌ తన చివరి క్షణాల్లో తన కొలీగ్స్‌తో మాట్లాడాడు. తనను ఎలాగైనా బతికించాలని అతను వేడుకున్నాడు. అతని మాటలను విన్న కొలీగ్స్‌ అందుకు దుఃఖించారు. నిజంగా ఎవరికీ ఇలాంటి పరిస్థితి రాకూడదని వారు కోరుకుంటున్నారు. మాయదారి మహమ్మారి ఇంకా ఎంత మంది జీవితాలను ఇలా చిన్నా భిన్నం చేస్తుందో ఆ భగవంతుడికే తెలియాలి.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM