దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ క్రమంలోనే రోజురోజుకు వేల సంఖ్యలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం అన్ని ప్రభుత్వాలు పటిష్ట చర్యలు చేపడుతున్నప్పటికీ రోజు సగటున లక్ష కేసులు నిర్ధారణ అవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర భారత దేశంలో రోజుకు సగటున లక్ష కేసులు నమోదవుతున్నాయని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (PHFI) నిపుణుడు డాక్టర్ గిరిధర్ బాబు తెలిపారు.
ఉత్తరాది రాష్ట్రాలలో ఈ మహమ్మారి కట్టడి చేయడానికి పటిష్ట చర్యలు తీసుకోకపోతే రోజుకు ఒక రాష్ట్రంలో లక్ష కేసులు వరకు నమోదు అవుతాయని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా వైద్య సదుపాయాలు తక్కువగా ఉన్న బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుందని తెలిపారు.
ఈ విధంగా పలు రాష్ట్రాలలో కరోనా కేసులు పెరగటానికి గల కారణం కేవలం నిర్లక్ష్యమేనని నిపుణులు భావిస్తున్నారు.గత కొంతకాలం నుంచి కరోనా సోకిన ఒక వ్యక్తి ఎంతమందికి కరోనా అంటించగలరనే విషయంపై పలు అధ్యయనాలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ఒక కరోనా సోకిన వ్యక్తి దాదాపు ముగ్గురికి కరోనా అంటించగలరని నిపుణులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే వీలైనంత వరకు కరోనా కట్టడి చేయడానికి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…