క‌రోనా వైర‌స్‌ను అడ్డుకోవాలంటే ఆవు మూత్రం తాగండి: బీజేపీ ఎమ్మెల్యే స‌ల‌హా

May 8, 2021 5:09 PM

ఆవు మూత్రంలో ఔష‌ధ గుణాలు ఉంటాయ‌ని ఆయ‌ర్వేదం చెబుతోంది. దీన్ని కొంద‌రు సైంటిస్టులు నిరూపించారు కూడా. ప‌లు ఔష‌ధాల త‌యారీలో ఆవు మూత్రాన్ని ఉప‌యోగిస్తారు. అయితే ఆవు మూత్రం వ‌ల్ల కొన్ని అనారోగ్య స‌మ‌స్య‌లు న‌యం అయ్యే మాట ఆయుర్వేదం ప్ర‌కారం నిజ‌మే అయిన‌ప్ప‌టికీ క‌రోనా వైర‌స్ త‌గ్గుతుంద‌ని ఎక్క‌డా చెప్ప‌లేదు. ఈ దిశ‌గా ఎవ‌రూ ప్ర‌యోగాలు కూడా చేయ‌లేదు. కానీ ఉత్త‌ర ప్ర‌దేశ్‌కు చెందిన ఆ బీజేపీ ఎమ్మెల్యే మాత్రం ఆవు మూత్రం తాగితే క‌రోనా రాకుండా అడ్డుకోవ‌చ్చ‌ని తెలిపారు.

drink cow urine to prevent covid spread says bjp mla

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బ‌ల్లియా జిల్లా బైరియా ప్రాంతానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ క‌రోనా వైర‌స్ రాకుండా అడ్డుకోవాలంటే ఆవు మూత్రం తాగాల‌ని చెప్పారు. అంతేకాదు ఆయ‌న కెమెరా ఎదుట ఆవు మూత్రం తాగి చూపించారు. క‌రోనా రాకుండా ఉండాలంటే ఆవు మూత్రాన్ని రోజూ రెండు, మూడు గుక్క‌ల చొప్పున నీటిలో క‌లిపి ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తాగాల‌ని సూచించారు. ఆవు మూత్రం తాగాక 30 నిమిషాల పాటు ఏమీ తీసుకోకూడ‌దని అన్నారు.

https://youtu.be/ONLk_v3inOw

అయితే ఆవు మూత్రం తాగితే క‌రోనా వ‌స్తుందో, రాదో చెప్ప‌లేము కానీ ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో రోజూ భారీ సంఖ్య‌లో క‌రోనా కేసులు నమోద‌వుతున్నాయి. శుక్ర‌వారం ఒక్క రోజే అక్క‌డ కొత్త‌గా 28,076 కేసులు న‌మోద‌య్యాయి. ఒక్క రోజులోనే 372 మంది చ‌నిపోయారు. మొత్తం 14,53,679 మందికి క‌రోనా సోక‌గా, 14,873 మంది చ‌నిపోయారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now