కరోనా వల్ల ఓ వైపు ప్రజలు భయాందోళనలకు గురవుతుంటే కోవిడ్ బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది నరక యాతన అనుభవిస్తున్నారు. రోజూ కొన్ని గంటల పాటు పీపీఈ కిట్లను ధరించి బాధను దిగమింగుతూ చికిత్స చేస్తున్నారు. మరోవైపు ఒత్తిడి పెరుగుతోంది. దీంతో అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. తాజాగా మరో డాక్టర్ ఒత్తిడి భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు.
ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్కు చెందిన డాక్టర్ వివేక్ రాజ్ (36) ఢిల్లీలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో రెసిడెంట్ డాక్టర్గా పనిచేస్తున్నాడు. కోవిడ్ నేపథ్యంలో గత నెల రోజుల నుంచి ఐసీయూలో ఉంటూ రోగులకు చికిత్స అందిస్తున్నాడు. రోజూ ఎంతో మంది కోవిడ్ రోగులకు చికిత్స అందించడమే అతని పని. అతని వల్ల ఎంతో మంది కోవిడ్ నుంచి బయట పడ్డారు. ఇక రోజూ అతను ప్రాణాపాయ స్థితిలో ఉండే కోవిడ్ రోగులకు కూడా చికిత్సను అందిస్తున్నాడు.
అయితే తాజాగా అతను ఒత్తిడిని భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నెల రోజులుగా ఐసీయూలో ఉంటూ చికిత్సను అందిస్తున్నానని, ఒత్తిడిని భరించలేకపోతున్నానని అతను తన సూసైడ్ నోట్లో తెలిపాడు. దీంతో అతని మృతి పట్ల తోటి డాక్టర్లు, వైద్య సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు. అతనికి గత నవంబర్ నెలలో వివాహం జరగ్గా అతని భార్య గర్భవతి. దీంతో అతని ఆత్మహత్య అతని కుటుంబంలో విషాదాన్ని నింపింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…