తనకు ఆరోగ్యం బాగా లేదని తన యజమానికి చెప్పడమే తన పాలిట తన కుటుంబం పాలిట శాపంగా మారింది. తన యజమాని చెప్పిన పని నిరాకరించినందుకే కోపంతో యజమాని తన భార్య పిల్లలను కిడ్నాప్ చేసి భార్య పట్ల ఎంతో అమానుషంగా ప్రవర్తించిన ఘటన మధ్యప్రదేశ్లో ఛతర్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
ఛతర్పూర్ జిల్లాలో ఓ గ్రామంలోని భూస్వామి తన పొలంలో ఉన్న చెట్లను నరికి వేయడానికి దళిత కార్మికుడిని నియమించుకున్నాడు. అయితే అతనికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆ పని చేయడానికి నిరాకరించాడు. పని ఒప్పుకొని చేయకపోవడంతో ఎంతో ఆగ్రహం వ్యక్తం చేసిన యజమాని ఆ దళితుడిపై వాగ్వాదానికి దిగాడు.ఈ క్రమంలోనే అతడు అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోగా అతని పై కోపం పెంచుకున్న యజమాని అతని ఇంటికి వెళ్లి తన భార్య పిల్లలు అతని తల్లిని కిడ్నాప్ చేయించాడు.
ఆ దళితుని భార్య గర్భవతి అని తెలిసినా కూడా ఏమాత్రం మానవత్వం లేకుండా ఆమెను కొట్టారు. నాలుగురోజుల పాటు వారిని బంధించిన యజమాని వారిని చిత్రహింసలకు గురిచేశారు.విషయం తెలిసిన జర్నలిస్ట్ పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసుల సహాయంతో వారి ఆచూకీని తెలుసుకుని గాయపడిన వారిని సరైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రధాన నిందితుడి అరెస్టు చేసి అతనికి సహకరించిన మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
తాజాగా ఈ ఘటనపై బాధితురాలు సంచలన వ్యాఖ్యలు చేసింది.సదరు యజమాని తన కొట్టడమే కాకుండా పిల్లల ఎదురుగానే తనపై లైంగికంగా దాడి చేశారని, ఆ విషయాన్ని పోలీసులు ఎఫ్ఐఆర్ లో నమోదు చేయలేదు అంటూ ఆరోపించింది. ఈ విషయంపై స్పందించిన పోలీసులు ఆమె కేవలం తనపై దాడి చేశారని, లైంగికంగా దాడి జరిగినట్లు తను పేర్కొనలేదని.. ఒకవేళ ఆమెపై లైంగికదాడి జరిగినట్టు చెబితే తప్పకుండా ఎఫ్ఐఆర్ లో నమోదు చేస్తామని ఛతర్పూర్ జిల్లా ఎస్పీ సచిన్ శర్మ తెలిపారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…