ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుంది. ఈ క్రమంలోనే భారతదేశంలో కూడా రోజురోజుకు ఈ మహమ్మారి బారిన పడే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ వైరస్ వ్యాప్తిలో కొత్తకొత్త లక్షణాలు బయటపడుతూ ప్రజలను కలవరపెడుతున్నాయి. అయితే కరోనా వైరస్ ఒకరి నుంచి ఒకరికి ఏ విధంగా వ్యాపిస్తుంది అనే విషయంపై తాజాగా పరిశోధకులు హెచ్చరించారు.
ఇంటి నుంచి బయటకు వెళ్లిన తర్వాత మనం ఎన్నో ప్రదేశాలను తాకుతాము. డబ్బులు సైతం ఒకరి నుంచి మరొకరికి చేతులు మారుతూ ఉంటాయి. అదేవిధంగా కొన్ని వస్తువులను తాకి అదే చేతితోనే ఆహారం తీసుకోవడం ద్వారా లేదా ఆ చేతులతో ముక్కు, నోటిని తాకడం ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుంది. బయటకు వెళ్ళిన తరువాత మాస్కులు లేకుండా, శానిటైజర్ లు వాడకుండా, ఉపరితలాన్ని తాకడం ద్వారా వైరస్ వ్యాప్తి అధికంగా జరుగుతుంది.
కరోనా వైరస్ తో బాధపడే వ్యక్తి ఒక ఉపరితలాన్ని తాకినప్పుడు, ఆ ఉపరితలాన్ని ఆరోగ్యవంతమైన వ్యక్తి తాకడం ద్వారా ఈ వైరస్ అతనికి వ్యాపిస్తుంది. ఈ విధంగా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తుంది కనుక ఏదైనా వస్తువులను తాకినప్పుడు వీలైనంత వరకు చేతులను, వస్తువులను శుభ్రంగా శానిటైజ్ చేయడం వల్ల ఈ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…