Disha Patani : సెలబ్రిటీలు ఎప్పుడూ ఏ పని చేసినా దాని తాలూకు విషయాలను సోషల్ మీడియాలో తమ అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇక తాము ప్రచారం చేసే ఉత్పత్తులకు చెందిన పోస్టులను కూడా సోషల్ మీడియాలో పెడుతుంటారు. ఇలా వారు డబ్బు సంపాదిస్తుంటారు.
అయితే సెలబ్రిటీలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో లైవ్గా ముందుకు వచ్చి అభిమానులతో ముచ్చటిస్తుంటారు. ఇలాగే నటి దిశా పటానీ కూడా తన అభిమానులతో ముచ్చటించింది. ఆస్క్ మీ ఎనీథింగ్ పేరిట ఆమె అభిమానులతో ముచ్చట్లు పెట్టింది.
అయితే ఒక ఫ్యాన్ మాత్రం నీ ఫిగర్ సైజ్ ఎంత ? అని అడిగే సరికి దిశా పటానీకి ఏం సమాధానం చెప్పాలో తెలియదు. మరోవైపు లైవ్లో ఉంది. దీంతో ఆమె ఒక పాండా ఫొటోను షేర్ చేసింది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో అయితే సెలబ్స్ కోపంతో ఊగిపోతారు. కానీ దిశా పటానీ మాత్రం ఆ విధంగా చేసింది. ఈ క్రమంలో ఆమె ఇచ్చిన రిప్లై అంత స్ట్రాంగ్గా లేకపోయినా.. సదరు ఫ్యాన్ను ఉతికి ఆరేయాల్సింది.. అని ఇతర ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.