విజయవాడలోని అమ్మవారి ఆలయాన్ని దర్శించుకొనే భక్తులకు ఆలయ కమిటీ పలు ముఖ్య ఆదేశాలను జారీ చేసింది.కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా నేటి నుంచే అమ్మవారి ఆలయంలో ఆంక్షలు విధిస్తున్నట్లు పాలకమండలి ఛైర్మన్, ఈవో, ఇతర వైదిక కమిటీ సభ్యులు సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికే ఆలయంలో పనిచేసే దాదాపు 45 మంది సిబ్బంది కరోనా బారిన పడగా, ఆలయ అర్చకులు మరణించడంతో ఆలయ కమిటీ పటిష్టమైన చర్యలు చేపట్టనుంది.
మంగళవారం ఉదయం 6.30 నుంచి రాత్రి 7.30 వరకే అమ్మవారి దర్శనం కల్పిస్తారు. రాత్రి ఏడు తర్వాత ఘాట్రోడ్డు, మహామండపం, మెట్ల మార్గాలను మూసివేయనున్నారు. అమ్మవారికి జరిగే ఏకాంత పూజలను యధావిధిగా నిర్వహించనున్నారు.
ఆలయాన్ని సందర్శించే భక్తులు తప్పనిసరిగా మాస్కు ధరించాలి. మాస్క్ లేనిపక్షంలో 200 జరిమానా విధించనున్నారు. దర్శనానికి వెళ్ళే భక్తులు ఆరు అడుగుల బౌతిక దూరం పాటించాలి. అదేవిధంగా ప్రతి గంటకు ఒకసారి క్యూలైన్లను సోడియం హైపోక్లోరైడ్తో శానిటైజ్ చేయాలని నిర్ణయించారు. ఆలయ ఆవరణలోని వసతి గృహాలు మరుగుదొడ్లు ఎప్పటికప్పుడు శుభ్రం చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. భక్తులకు టెంపరేచర్ పరిశీలించిన తర్వాతే దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. అదేవిధంగా భక్తులు గుంపులుగా చేరకుండా భౌతిక దూరం పాటించే విధంగా అన్ని జాగ్రత్తలను చేపట్టినట్లు ఆలయ కమిటీ తెలియజేసింది.
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…
నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ . ఆయన…