Allu Sirish : స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఎన్నో చిత్రాలను నిర్మాతగా తెలుగు తెరకు పరిచయం చేశారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై విజేత, రౌడీ అల్లుడు, జల్సా, 100% లవ్, సరైనోడు, గీతగోవిందం, అల వైకుంఠపురంలో వంటి ఎన్నో చిత్రాలను నిర్మించారు. అల్లు అరవింద్ కి ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు వెంకట్ నిర్మాతగా మారాడు. ఇక రెండవ కుమారుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సక్సెస్ ఫుల్ హీరోగా ఎదిగారు. అందరి కంటే చిన్న కుమారుడు శిరీష్ సైతం హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు.
2013లో గౌరవం చిత్రంతో తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యారు. ఇతను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి చాలా కాలం అయినా కూడా దాదాపు ఆరు చిత్రాల కన్నా ఎక్కువగా నటించలేదు. నటుడుగా మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరోగా సూపర్ హిట్ సక్సెస్ ను మాత్రం అందుకోలేదు. టాలెంట్ ఉన్నా కూడా శిరీష్ కి కాలం కలసి రాలేదు. మొదట అల్లు అర్జున్ కూడా గంగోత్రి చిత్రంతో ఇతను కూడా ఒక హీరో అనే టాక్ ను అందుకున్నాడు. తర్వాత ఆర్య చిత్రంతో సక్సెస్ ను అందుకుని వరుస ఆఫర్లు చేజిక్కించుకున్నాడు. పుష్ప చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా హోదాను సంపాదించుకున్నాడు. శిరీష్ పరిస్థితి దీనికి విరుద్ధంగా ఉంది.
ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా సక్సెస్ ని అందుకోలేకపోతున్నాడు. శిరీష్ చివరిగా నటించిన ఎబిసిడి చిత్రం 2019 లో విడుదలైంది. ఇప్పుడు ప్రస్తుతం ప్రేమ కాదంట ఈ చిత్రంలో నటిస్తున్నాడు. సరైన సక్సెస్ లేని శిరీష్ చిత్రం చేయడం అనేది జరుగుతుందో లేదో అనే వార్త వినిపిస్తోంది. ఇప్పటివరకు చిత్ర యూనిట్ కూడా ఎటువంటి అప్డేట్స్ను ఇవ్వలేదు. ఈ క్రమంలో శిరీష్ తీవ్రమైన డిప్రెషన్ లో ఉన్నారట. అటు తండ్రి అల్లు అరవింద్ గానీ, ఇటు అన్న అల్లు అర్జున్ గానీ తన కెరీర్ గురించి పట్టించుకోవడంలేదని ఆవేదన చెందుతున్నారట. తండ్రి అల్లు అరవింద్ అన్న అర్జున్ కెరీర్ ని ఎంతో గొప్పగా నిర్మించారు. నన్ను మాత్రం పట్టించుకోకుండా వదిలేశారు అంటూ బాధను వ్యక్తం చేస్తున్నాడట. అల్లు అర్జున్ భవిష్యత్తుపై ఉన్న శ్రద్ధ నాపై లేదని శిరీష్ తండ్రిపైన ఆరోపణలు చేస్తున్నారని తెలుస్తోంది.
తండ్రి అల్లు అరవింద్ తలచుకుంటే తన కెరీర్ ను కూడా గొప్పగా నిలబెట్టగలరు. కానీ ఆయన నా గురించి శ్రద్ధ తీసుకోవడం లేదని మనోవేదనకు గురయ్యారని తెలుస్తోంది. కొంతకాలంగా శిరీష్ సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉంటున్నారు. కెరియర్ పరంగా మనోవ్యధ కారణంగానే శిరీష్ కుటుంబ సభ్యులతో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని వార్త వినిపిస్తోంది. అంతేకాకుండా శిరీష్ కొంతకాలంగా అను ఇమ్మానియేల్ తో రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం శిరీష్ కుటుంబ సభ్యులతో విడిపోయి ముంబైలో ఉన్నట్లు సమాచారం. మరి ఈ వార్తల్లో నిజం ఎంతో తెలియదు కానీ, ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…