Ajith Thegimpu Movie : థియేటర్స్లో విడుదలైన కొద్ది రోజులకి సినిమాలు ఓటీటీలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఇక అజిత్ నటించిన తెగింపు చిత్రం సంక్రాంతికి విడుదలై మంచి విజయం సాధించగా, ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అజిత్ సినిమా అంటే తమిళంతో పాటు తెలుగులోనూ హైప్ బాగానే ఉంటుంది. యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రాన్ని దర్శకుడు హెచ్.వినోద్ తెరకెక్కించగా, పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందించారు. ఇక ఈ సినిమాలో అజిత్ సరికొత్త లుక్లో అల్ట్రా స్టైలిష్ స్వాగ్తో కనిపించిన తీరు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తునివు సినిమా రిలీజ్కు ముందే, ఈ చిత్ర టీజర్, ట్రైలర్లు ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.
అయితే తెగింపు సినిమాలో యాక్షన్ డోస్ ఎక్కువగా ఉండడంతో పాటు అజిత్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆక్టుటకోవడంలో సక్సెస్ అయ్యింది. రొటీన్ కథ అయినా, సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్లు ప్రేక్షకులను ఇంప్రెస్ చేశాయి. అయితే ఈ సినిమాకు తమిళంలో మాత్రం అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. ఇక ఈ సినిమాకు వసూళ్లు కూడా బాగానే వచ్చాయని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ గురించి సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. జనవరి 11న విడుదలైన ఈ సినిమా.. రిలీజైన నెల రోజులకే ఓటిటిలో స్ట్రీమింగ్ కాబోతుందని అంటున్నారు.

సినీ వర్గాల సమాచారం ప్రకారం.. తెగింపు మూవీ డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్నారు. కాగా.. స్ట్రీమింగ్ వచ్చేసి ఫిబ్రవరి 10 నుండి కానుందని తెలుస్తుంది.. అయితే ఈ విషయంపై మేకర్స్ అయితే క్లారిటీ ఇవ్వలేదు. కానీ.. ఫ్యాన్స్ మాత్రం ఓటీటీలో ఈ సినిమాని చూసేందుకు తెగ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. బ్యాంకు మోసాల నేపథ్యంలోనే ఈ సినిమా కథ రాసుకున్నాడు దర్శకుడు వినోద్. ఇదే కథను కాస్త అటూ ఇటూగా సర్కారు వారి పాటలో మహేష్ బాబుతో చెప్పించాడు దర్శకుడు పరశురామ్. అందులోనూ బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టిన బడా వ్యక్తుల గురించి చెప్పుకొచ్చాడు.