మనకు సీజనల్గా లభించే పండ్లలో సీతాఫలం కూడా ఒకటి. దీన్ని చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే సీజనల్గా లభించే పండ్లను అధికంగా తినాలని వైద్య నిపుణులు చెబుతుంటారు. వీటి వల్ల మనం అనేక లాభాలను పొందవచ్చు. ఇక సీతాఫలం కూడా సీజనల్ పండే. కనుక దీన్ని కూడా ఎక్కువగా తినాలి. సీతాఫలాన్ని ఈ సీజన్లో తినడం వల్ల మనం అనేక లాభాలను పొందవచ్చు. సీతాఫలంలో మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు ఉంటాయి. అందువల్ల ఈ పండ్లను ఈ సీజన్లో విడిచిపెట్టకుండా తినాలి.
సీతాఫలాల్లో విటమిన్ బి6 అధికంగా ఉంటుంది. ఇది యాంటీ ఇన్ఫ్లామేటరీ పదార్థంగా పనిచేస్తుంది. దీంతో ఊపిరితిత్తుల్లో వచ్చే వాపులు తగ్గుతాయి. అలాగే ఊపిరితిత్తులు శుభ్రంగా మారుతాయి. ఈ సీజన్లో మనకు సహజంగానే దగ్గు, జలుబు, ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలు వస్తాయి. కాలుష్యం కూడా ఎక్కువగానే ఉంటుంది. కనుక సీతాఫలాన్ని తింటే ఈ సమస్యల నుంచి బయట పడడంతోపాటు ఊపిరితిత్తులను కూడా శుభ్రంగా మార్చుకోవచ్చు. లంగ్స్ కడిగేసినట్లు క్లీన్ అవుతాయి. కాబట్టి ఈ సీజన్లో సీతాఫలాన్ని తప్పక తినాలి.
ఈ పండ్లలో ప్రోటీన్లు, ఫైబర్ అధికంగా ఉంటాయి. కనుక శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. బలహీనంగా ఉన్నవారు, జిమ్ చేసేవారు, శారీరక శ్రమ అధికంగా చేసేవారు ఈ పండ్లను తింటే శరీరానికి తక్షణమే శక్తి లభించి ఉత్సాహంగా మారుతారు. చురుగ్గా పనిచేస్తారు. అలసట రాదు. అలాగే ఫైబర్ అధికంగా ఉంటుంది కనుక బరువు తగ్గేందుకు, జీర్ణ సమస్యలను తగ్గించేందుకు సహాయ పడుతుంది. ముఖ్యంగా గ్యాస్, మలబద్దకం సమస్యల నుంచి బయట పడవచ్చు. అలాగే అల్సర్లు కూడా తగ్గుతాయి.
సీతాఫలాలను తినడం వల్ల విటమిన్ సి అధికంగా లభిస్తుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో వ్యాధులు, ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. అలాగే ఈ పండ్లలో ఉండే పొటాషియం, మెగ్నిషియం బీపీని తగ్గిస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇక డయాబెటిస్ ఉన్నవారు ఈ పండ్లను తినేందుకు సంకోచిస్తుంటారు. కానీ సీతాఫలం పండ్లను మధుమేహం ఉన్నవారు కూడా తినవచ్చు. అయితే మోతాదులోనే తినాలి. ఒకటి లేదా రెండు మీడియం సైజ్ పండ్లను రోజుకు ఒకసారి తినవచ్చు. ఈ పండ్లను తినడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు విరివిగా లభిస్తాయి. ఇవి మనస్సును ప్రశాంతంగా ఉంచుతాయి. దీంతో డిప్రెషన్ నుంచి బయట పడవచ్చు.
ఇలా సీతాఫలం పండ్లను ఈ సీజన్లో అధికంగా తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. కాబట్టి ఎక్కడ ఈ పండ్లు లభించినా విడిచిపెట్టకండి. రోజుకు కనీసం ఒకటి లేదా రెండు సీతాఫలాలను తింటే ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…