Prabhas : ఆంధ్రప్రదేశ్లో ఇటీవల వరదలు వచ్చి భారీ ఎత్తున నష్టం సంభవించిన విషయం విదితమే. ప్రజలు వరదల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే తాజాగా పలువురు టాలీవుడ్ హీరోలు ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళాలు అందించారు. ఈ క్రమంలోనే వారి సరసన ప్రభాస్ చేరిపోయాడు.
రెబల్ స్టార్ ప్రభాస్ ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్కు భారీ విరాళం అందజేశాడు. ఏకంగా రూ.1 కోటిని విరాళంగా అందించాడు. ఇప్పటి వరకు ఎన్టీఆర్, చిరంజీవి, రామ్ చరణ్ తేజ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ లు రూ.25 లక్షల చొప్పున విరాళాలు అందించగా.. వీరందరి కన్నా ప్రభాస్ ఎక్కువ విరాళం అందించడం విశేషం.
గతంలోనూ ప్రభాస్ ఇదేవిధంగా భారీ ఎత్తున విరాళాలు అందజేశాడు. కోవిడ్ సమయంలో రెండు తెలుగు రాష్ట్రాలకు ఇచ్చాడు. తరువాత తెలంగాణలో వచ్చిన వరదలకు సహాయం చేశాడు. గతంలో ఏపీలో వైజాగ్లో వచ్చిన హుదుద్ తుఫాన్కు బాధితులకు అండగా నిలిచాడు. ఈ క్రమంలోనే భారీ మొత్తంలో మరోమారు ప్రభాస్ విరాళాన్ని అందజేసి తన ఉదారతను చాటుకున్నాడు.
ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే.. పూజా హెగ్డెతో కలిసి రాధే శ్యామ్ లో నటిస్తుండగా.. ఈ మూవీ జనవరిలో విడుదల కానుంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సలార్ అనే మూవీ చేస్తున్నాడు.
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…
నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ . ఆయన…