Guppedantha Manasu November 4th Episode : శైలేంద్ర మీద పంచులు వేస్తుంది ధరణి. ఈ పరిస్థితి వస్తుందని తెలిసే, తలనొప్పి టాబ్లెట్లు తీసుకువచ్చాను అని వస్తుంది. మాట్లాడకుండా చూడమని మావయ్య గారు చెప్పారు. కానీ, అలా జరగట్లేదు కాబట్టి, కొంచెం మాట్లాడుకోండి అని చెప్పి ధరణి వెళ్ళిపోతుంది. ఏంటి మమ్మీ దీనికి భయం లేకుండా పోతోంది అని శైలేంద్ర అంటాడు. దేవయాని పలకదు. మమ్మీ అని గట్టిగా పిలిస్తే, అప్పుడు దేవయాని చూస్తుంది. ఆ కొత్త ఆఫీసర్ ముకుల్ కళ్ళు డేగ కళ్ళులా ఉన్నాయి. వట్టిగానే మనుషుల్ని పసికట్టేలా ఉన్నాడు.
రిషికి మన గురించి తెలిసిందా..? ఒకవేళ తెలిస్తే, అని దేవయాని అంటే, అతనికి తెలిసే ఛాన్స్ లేదు మమ్మీ అని అంటాడు. అతనిని నేను చూసుకుంటాను భయపడకు అని శైలేంద్ర అంటాడు. నేను భయపడేది ముకుల్ కి కాదు రిషికి. పెద్దమ్మ అని కూడా చూడడు, నిజం తెలిస్తే మనల్ని చంపేస్తాడు అని దేవయాని భయపడుతుంది. ముకుల్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి వంటి విషయాలు నేను తెలుసుకుంటాను అని శైలేంద్ర అంటాడు. మరో వైపు పెద్దమ్మ ఇంటికి వెళ్లావుగా ఏమైంది అని అడుగుతాడు మహేంద్ర.
పర్సనల్స్ మాట్లాడడానికి వెళ్లలేదు. అమ్మ కేసు విషయం గురించి, స్పెషల్ ఆఫీసర్ ముకుల్ కి పరిచయం చేద్దామని, కేసు గురించి సపోర్ట్ చేయాల్సిందని చెప్పి వచ్చాను. ముకుల్ ఎవరో కాదు అమ్మ స్టూడెంట్ అని చెప్తాడు రిషి ముకుల్ ని మీరు కూడా, ఒకసారి కలవండి అంటాడు. టీ కి పిలుస్తాను అని రిషి అంటే, ఓకే నాకు తెలిసినవి కూడా చెప్తాను అని మహేంద్ర అంటాడు. ముకుల్ కచ్చితంగా అమ్మని హత్య చేసిన వాళ్ళని పట్టుకుంటాడని చెప్తాడు. వాడు ఎవడైనా, ఎంతటి వాడైనా వదిలిపెట్టను. మీ ముందే శిక్షిస్తాను అని రిషి చెప్తాడు.
ఈ విధంగా అయినా సర్ ముందడుగు వేశారు మావయ్య. ఈసారి వాళ్ళ బండారం బయటపడుతుంది అని వసుధార అంటుంది. రిషి వేసే ప్రతి అడుగు, వాళ్ళ పతనానికి దారితీస్తుంది అంటాడు మహేంద్ర. మహేంద్ర కాల్ కోసం అనుపమ ట్రై చేస్తుంది. జగతి గురించి నువ్వు తప్ప ఇంకెవరు చెబుతారు, పేర్లు రాసుకున్నచోట ఒక్కడే వచ్చాడంటే ఒంటరిగా ఉన్నారని తెలుస్తోంది అని అనుపమ అనుకుంటుంది. ఈలోగా పెద్దమ్మ వస్తుంది ఏ నిర్ణయం తీసుకున్నావు అని అడుగుతుంది. నా సంతోషం వెతుక్కుంటూ వెళ్తాను మహేంద్రని కలుస్తాను. కొత్త జీవితాన్ని మొదలు పెడతాను అని అనుపమంటుంది.

అనుపమ అలా చెప్పడంతో పెద్దగా సంతోషిస్తుంది. మన తప్పులకి తల్లిదండ్రులు ని నిందించకూడదు. అయినా వాళ్ళ విషయంలో కఠినంగా ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కన్న బంధాన్ని దూరం చేసుకోకు, వాళ్ళని కూడా కలువు అని చెప్తుంది. అలానే అని అనుపమ హగ్ చేసుకుంటుంది. ఇంకో వైపు చూస్తే వసుధార సార్ రెడీనా అని అడుగుతుంది. ఐదు నిమిషాలు అని గది లోపల ఉన్న రిషి అంటాడు. రిషి ఎంతకీ రాకపోవడంతో, డోర్ కి పేపర్ అంటించి వెళ్ళిపోతుంది.
రిషి బయటికి వచ్చేసరికి వసుండదు వెయిటింగ్ ఆల్వేస్ ఫర్ యు అని రాసి ఉన్న పేపర్ చదువుతాడు. వసుధారా కి మెసేజ్ పెడతాడు. ఇద్దరూ సరదాగా వాదించుకుంటారు. హాల్లో కూర్చుని ముకుల్ గురించి దేవయాని, శైలేద్రా ఆలోచించుకుంటూ ఉంటారు. ఇందులో వచ్చిన ఫణింద్ర లేటుగా ఎందుకు పడుకుంటున్నావు అని అడుగుతాడు దేవయానిని. ఆయన కూడా లేటుగా పడుకున్నాడని ధరణి అంటుంది. మళ్లీ ఇరికించిందని మనసులో శైలేంద్ర అనుకుంటాడు.
అసలు రిషి వస్తే ఏమో అనుకున్నాను. కానీ ఆఫీసర్ వస్తారని అనుకోలేదు. మహేంద్ర అలా తాగడం వల్ల, ఇలా జరిగిందని దేవయాని అంటుంది. నువ్వు వాళ్ళని ఎప్పటికీ అర్థం చేసుకోలేవు. ఇలాంటివి చేస్తే, నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. ధరణి పిలిచి థాంక్స్ అని అంటుంది. నువ్వు ఎందుకు థాంక్స్ చెప్పావో అర్థమైంది. ఇంట్లో నీ పరిస్థితి నా పరిస్థితి ఒకటే. మనం మారనంతవరకు పరిస్థితి మారదు అని అంటాడు. వీళ్లు మాట్లాడుకోకుండా ఉంటే నాకు మనశ్శాంతిగా ఉంటుందని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ధరణి కూడా వెళ్ళిపోతుంది.
మమ్మీ నువ్వు టెన్షన్ లో ఏదేదో మాట్లాడుతున్నావు అని ఫైర్ అవుతాడు. ఇలానే చేస్తే డాడ్ కూడా, వాళ్ళ దగ్గరికి వెళ్లిపోతాడు. ఇంకోవైపు సార్ నిజంగానే ఫీల్ అయినట్టున్నారు వెయిటింగ్ ఫర్ యు అని రాసినందుకు బాధపడుతున్నారేమో.. సార్ కి సెల్ప్ రెస్పెక్ట్ ఎక్కువ. ఇలా వచ్చేయడం కరెక్ట్ కాదని వెనక్కి వెళ్తుంది వసుధారా. ఇంతలో రిషి వస్తాడు. మీటింగ్ ఉందని త్వరగా వచ్చేసాను మళ్ళీ వచ్చేయడం కరెక్ట్ కాదని వెనక్కి రావాలని అనుకున్నాను అని వసుధార అంటుంది. ఇలానే ఉంటే ఇంకా లేటవుతుంది పదా అని రిషి అంటాడు. ఇద్దరు కారులో కూర్చుంటారు. అక్కడితో ఈ రోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.