కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో దేశంని పలు రాష్ట్రాలు ఇప్పటికే లాక్డౌన్ను అమలు చేస్తున్నాయి. ఢిల్లీలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ లాక్డౌన్ను మరో వారం పాటు పొడిగించారు. మహారాష్ట్రలో లాక్డౌన్ లేదు. కానీ దాదాపుగా అలాంటి పరిస్థితే ఉంది. ఇక కర్ణాటకలో తాజాగా 14 రోజుల పాటు లాక్డౌన్ విధిస్తూ ఆ రాష్ట్ర సీఎం యడ్యూరప్ప నిర్ణయం తీసుకున్నారు. దీంతో అక్కడ 14 రోజుల పాటు లాక్డౌన్ అమలు కానుంది. అయితే తెలంగాణలోనూ పలు జిల్లాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా రాష్ట్రంలోనూ లాక్డౌన్ విధిస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది.
కోవిడ్ కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్న నేపథ్యంలో తెలంగాణలో మే 1వ తేదీ నుంచి లాక్డౌన్ను విధిస్తారని ప్రచారం జరుగుతోంది. కొందరు సైంటిస్టులు, వైద్య నిపుణులు, మేథావులు ఇప్పటికే ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. రాష్ట్రంలో లాక్డౌన్ను అమలు చేయాలని సూచించారు. అయితే సీఎం కేసీఆర్ ఈ విషయంపై ఈ వారంలో నిర్ణయం తీసుకోనున్నారు.
సీఎం కేసీఆర్ కోవిడ్ బారిన పడిన తరువాత హోం ఐసొలేషన్లో ఉండి చికిత్స తీసుకుంటున్న విషయం విదితమే. అయితే కేంద్రం మే 1 నుంచి దేశంలో 18 ఏళ్ల పైబడిన వారికి టీకాలను వేస్తామని చెప్పాక సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని పౌరులకు ఉచితంగా టీకా అందిస్తామన్నారు. అలాగే రాష్ట్రంలో కోవిడ్ కట్టడికి రాత్రి కర్ఫ్యూను అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే చర్యలు చేపడుతున్నారు. కానీ రాత్రి కర్ఫ్యూ వల్ల పెద్దగా ఉపయోగం లేదని పెరిగిపోతున్న కేసుల సంఖ్యను చూస్తే తెలుస్తుంది. అందువల్ల కేసీఆర్ ఈ విషయంపై మరో 3, 4 రోజుల్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.
లాక్ డౌన్ విధించడం, మహారాష్ట్ర తరహా కఠిన ఆంక్షలను అమలు చేయడం లేదా ప్రస్తుతం ఉన్న స్థితినే కొనసాగించడం.. ఈ మూడు విషయాల్లో ఏదో ఒక దాన్ని అమలు చేస్తారని తెలుస్తోంది. అయితే రాష్ట్రంలో లాక్డౌన్ను విధించేది లేదని గతంలో సీఎం కేసీఆర్ సహా పలువురు మంత్రులు కూడా స్పష్టం చేశారు. కానీ అప్పటి పరిస్థితి వేరు, ఇప్పుడు వేరు. కనుక సీఎం కేసీఆర్ లాక్డౌన్ వైపే మొగ్గు చూపే అవకాశం కూడా లేకపోలేదని తెలుస్తోంది. అయితే ఆయన ఏం నిర్ణయం తీసుకుంటారన్నది ప్రస్తుతం ఉత్కంఠను కలిగిస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…