Huzurabad Election: మాజీ మంత్రి ఈటల రాజేందర్ తెరాసకు రాజీనామా చేసినప్పటి నుంచి ఆయన నియోజకవర్గం అయిన హుజురాబాద్లో ఆయనకు వ్యతిరేకంగా తెరాసలో ఎవరు పోటీ చేస్తారు ? అన్న చర్చ బలంగా కొనసాగుతోంది. ఇప్పటికీ తెరాస ఇంకా ఈటలకు పోటీగా ఎవరినీ బరిలో దింపలేదు. ఇక కాంగ్రెస్ పార్టీ అయితే ఆ దిశగా ఆలోచన చేయడం లేనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పోటీ ఈటలకు, తెరాసకు మధ్యే ఉంటుందన్నది రాజకీయ విశ్లేషకుల మాట. ఆ విషయం ప్రజలందరికీ తెలుసు. అయితే ఈటల లాంటి బలమైన నాయకున్ని ఎదుర్కొనేందుకు అంతే బలంగా ముందుకు సాగాలి. అందుకే సీఎం కేసీఆర్ దళిత బంధు స్కీమ్ను ప్రవేశపెట్టారా ? అంటే.. అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది.
దళిత బంధు స్కీమ్ను దశలవారీగా రాష్ట్రంలో అమలు చేయనున్నారు. తొలుత పైలట్ ప్రాజెక్టు కింద హుజురాబాద్లో దీన్ని ప్రారంభిస్తారు. ఈ పథకంలో భాగంగా ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తారు. దీంతో వారు తమకు నచ్చిన వ్యాపారం, ఉపాధి కల్పించుకోవచ్చు. దళితుల సాధికారత కోసం ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇందుకు గాను తొలి దశ కింద రూ.1200 కోట్లను కూడా అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో ఉన్న మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దళిత బంధు స్కీమ్ను దశలవారీగా అమలు చేయనున్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి 100 కుటుంబాలకు సహాయం అందిస్తారు. ఇక జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ స్కీమ్ను అమలు చేస్తారు.
అయితే ఈ స్కీమ్ను ప్రకటించినప్పటి నుంచి అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పార్టీలు తెరాసపై ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి. కేవలం హుజురాబాద్ ఉప ఎన్నిక కోసమే ఈ స్కీమ్ను ప్రవేశపెట్టారని అంటున్నాయి. ఓ సమావేశంలో సీఎం కేసీఆర్ స్వయంగా ఈ విషయాన్ని పరోక్షంగా అంగీకరించారు. అయితే ఈ స్కీమ్ వల్ల హుజురాబాద్లో తెరాస గెలుపు ఖాయమేనా ? అంటే ఆ విషయం ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే స్కీమ్ను అమలు చేసినా అది ఈటల నియోజకవర్గం కనుక, ఆయన బలమైన నేత కనుక ఇంకా అనేక వ్యూహాలను అమలు చేయాలి. ఈ స్కీమ్లో డబ్బులు తీసుకున్న వారు కచ్చితంగా తెరాసకు ఓటు వేస్తారన్న గ్యారంటీ లేదు. కానీ మెజారిటీ ప్రజలు ఓటు వేసేందుకు చాన్స్ ఉంది. అదే జరిగితే ఈ ఉప ఎన్నికలో తెరాస పై చేయి సాధిస్తుంది. లేదా ఈటల గెలుస్తారు. మరి ఈ స్కీమ్ అక్కడ తెరాసకు ఓట్లను తెచ్చి పెడుతుందో లేదో చూడాలి. కానీ తెరాస మాత్రం దళిత బంధుపైనే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది..!
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…