శ్రావణ మాసం ఎంతో పవిత్రమైన మాసంగా హిందువులు భావిస్తారు. ఈ క్రమంలోనే ఈ నెల మొత్తం ప్రత్యేక పూజలు వ్రతాలు చేస్తూ భక్తితో కలిగి ఉంటారు. మహిళలకు ఐతే ఈ నెల మొత్తం పండగ లాగా ఉంటుంది. పూజలు వ్రతాలు చేస్తూ నెల మొత్తం భక్తిభావంతో ఉంటారు. ఎంతో పవిత్రమైన ఈ శ్రావణ మాసంలో ఎలాంటి పనులు చేయకూడదు? ఏ పనులు చేయాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
చేయాల్సిన పనులు
శ్రావణ మాసం మొత్తం ఎంతో భక్తి భావంతో ఉండాలి. ఈ క్రమంలోనే లక్ష్మీదేవికి, పార్వతికి, శివుడికి పెద్ద ఎత్తున పూజలు చేస్తారు. అదేవిధంగా పాలు పాల పదార్థాలను దానం చేయడం ఎంతో మంచిది. శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలు మంగళగౌరి వ్రతం చేసి ముత్తైదువులకు పసుపు కుంకుమలతో పాటు శెనగలను ఇవ్వడం ఎంతో మంచిది. శ్రావణ మాసంలో వచ్చే సోమ మంగళ శుక్ర శనివారాలు ఎంతో పవిత్రంగా భావించి ప్రత్యేక పూజలు చేయాలి. నెల మొత్తం ఇంటిని శుభ్రంగా ఉంచి పూజ చేయటం వల్ల సకల సంతోషాలు కలుగుతాయి.
చేయకూడని పనులు
ఎంతో పవిత్రంగా భావించే శ్రావణమాసంలో మాంసాహారం ముట్టకూడదు. అదేవిధంగా చేపలను కూడా తినకూడదు.శ్రావణ మాసంలో ఉపవాసం ఉండి పూజలు చేసేవారు ఉల్లిపాయ వెల్లుల్లి వేసి ఆహారపదార్థాలను ముట్టుకోకూడదు. అదేవిధంగా రాగి పాత్రలో చేసిన ఆహార పదార్థాలను తినకూడదు. ముఖ్యంగా పరమేశ్వరుడికి పూజలో తులసి ఆకులను ఉపయోగించకూడదు.శ్రావణ మాసంలో ఈ పనులు చేయకుండా భక్తిభావంతో ఉండటం వల్ల ఆ దేవుడి అనుగ్రహం మనపై కలుగుతుంది.