Kaliyugam : మొత్తం నాలుగు యుగాలు ఉన్నాయన్న సంగతి మనకి తెలుసు. మొదటి యుగమైన సత్యయుగంలో, ధర్మం నాలుగు పాదాలు మీద నడిచింది. రెండో యుగమైన త్రేతాయుగంలో, ధర్మం మూడు పాదాల మీద నడిస్తే, మూడవ యుగం ద్వాపర యుగంలో రెండు పాదాల మీద నడిచింది. ప్రస్తుతం కలియుగంలో ధర్మం అనే మాటలకి ఇప్పుడు చోటే లేదు. సత్య యుగంలో భగవంతుడు నారాయణుడు లక్ష్మీ సహితంగా భూమిని పరిపాలించాడు. 17 లక్షల 28 వేల సంవత్సరాలు ఈ యుగం యొక్క కాల పరిమాణం. ధర్మం నాలుగు పాదాలు మీద నడిచిందని శివపురాణంలో చెప్పబడింది. ఈ యుగంలో ఎలాంటి బాధలు, ఎలాంటి కష్టాలు లేకుండా ప్రజలు జీవించేవారు.
అసలు అకాల మరణాలే లేవు. కృత యుగానికి రాజు సూర్యుడు. మంత్రి గురువు అధిపతి కావడంతో అంతా బంగారమయం. ప్రభువుకి, ప్రజలకి మధ్య ఎలాంటి విభేదం ఉండేది కాదు. విరోధం లేకుండా చక్కగా రోజులు నడిచేవట. ఇక త్రేత యుగంలో, శ్రీరామచంద్రుడుగా భగవంతుడు అవతరించి రావణాసురుడుని సంహరించి, ధర్మసంస్థాపన చేశాడు. 12 లక్షల 96 వేల సంవత్సరాలు ఈ యుగం యొక్క పరిమితి. త్రేతా యుగంలో రాజుగా కుజుడు, మంత్రిగా శుక్రుడు ఉన్నారు. కుజుడు యువకుడు. యుద్ధ ప్రియుడు.
రాజుగా ఆచారాలకి కట్టుబడి ఉండకుండా తిరిగేవాడు. మంత్రులు క్రూర స్వభావులై, రాజపాలనని బ్రష్టు పట్టించారు. స్త్రీ వ్యామోహంతో కలహాలు పెంచి, దైవ కార్యాలు నిర్వహించే వంశాలని అంతరించేలా చేసారు. ఇక ద్వాపరయుగం విషయానికి వస్తే, శ్రీకృష్ణుడిగా శ్రీమహావిష్ణువు అవతరించాడు. ఎనిమిది లక్షల 64 వేల సంవత్సరాలు ఈ కాల పరిమాణం. చంద్రుడు రాజుగా, మంత్రిగా బుధుడు ఉన్నారు. చంద్రుడికి, బుధుడుకి ఒకరంటే ఒకరికి పడదు. దేవతా కార్యాలని సగానికి సగం నాశనం చేశారు.
ఇలా ద్వాపరయుగంలో ధర్మం రెండు భాగాలుగా నశించి, కలియుగం వచ్చింది. కలియుగం కాలపరిమితి నాలుగు లక్షల 32000 సంవత్సరాలు. సుమారు 5000 సంవత్సరాలు గడిచిపోయాయి. కలియుగానికి రాజు శని, మంత్రులు రాహు కేతువులు. మంత్రులు ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు. రాహువు శనికి మిత్రుడు. కలియుగంలో అసత్యం, క్రూరత్వం, అధర్మం, అన్యాయం తలెత్తుతాయి. దైవభక్తి తగ్గుతుంది. హింస సిద్ధాంతాలు పెరుగుతాయి. పాపం వల్ల దుఃఖం అనుభవిస్తాం అనే భయం పోతుంది. స్త్రీని, ధనాన్ని పొందిన వాడే గొప్పవాడని అనుకునే రోజులు వస్తాయి. అధర్మం బాగా పెరుగుతుంది. కలియుగంలో మంచి అనే మాటకి చోటే ఉండదు. అధర్మం వైపు అందరూ ఆసక్తి చూపుతారు అని శివపురాణం లో చెప్పబడింది.
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…
నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ . ఆయన…