ఆధ్యాత్మికం

Kaliyugam : కలియుగం ఇంకా ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుందో తెలుసా..?

Kaliyugam : మొత్తం నాలుగు యుగాలు ఉన్నాయన్న సంగతి మనకి తెలుసు. మొదటి యుగమైన సత్యయుగంలో, ధర్మం నాలుగు పాదాలు మీద నడిచింది. రెండో యుగమైన త్రేతాయుగంలో, ధర్మం మూడు పాదాల మీద నడిస్తే, మూడవ యుగం ద్వాపర యుగంలో రెండు పాదాల మీద నడిచింది. ప్రస్తుతం కలియుగంలో ధర్మం అనే మాటలకి ఇప్పుడు చోటే లేదు. సత్య యుగంలో భగవంతుడు నారాయణుడు లక్ష్మీ సహితంగా భూమిని పరిపాలించాడు. 17 లక్షల 28 వేల సంవత్సరాలు ఈ యుగం యొక్క కాల పరిమాణం. ధర్మం నాలుగు పాదాలు మీద నడిచిందని శివపురాణంలో చెప్పబడింది. ఈ యుగంలో ఎలాంటి బాధలు, ఎలాంటి కష్టాలు లేకుండా ప్రజలు జీవించేవారు.

అసలు అకాల మరణాలే లేవు. కృత యుగానికి రాజు సూర్యుడు. మంత్రి గురువు అధిపతి కావడంతో అంతా బంగారమయం. ప్రభువుకి, ప్రజలకి మధ్య ఎలాంటి విభేదం ఉండేది కాదు. విరోధం లేకుండా చక్కగా రోజులు నడిచేవట. ఇక త్రేత యుగంలో, శ్రీరామచంద్రుడుగా భగవంతుడు అవతరించి రావణాసురుడుని సంహరించి, ధర్మసంస్థాపన చేశాడు. 12 లక్షల 96 వేల సంవత్సరాలు ఈ యుగం యొక్క పరిమితి. త్రేతా యుగంలో రాజుగా కుజుడు, మంత్రిగా శుక్రుడు ఉన్నారు. కుజుడు యువకుడు. యుద్ధ ప్రియుడు.

Kaliyugam

రాజుగా ఆచారాలకి కట్టుబడి ఉండకుండా తిరిగేవాడు. మంత్రులు క్రూర స్వభావులై, రాజపాలనని బ్రష్టు పట్టించారు. స్త్రీ వ్యామోహంతో కలహాలు పెంచి, దైవ కార్యాలు నిర్వహించే వంశాలని అంతరించేలా చేసారు. ఇక ద్వాపరయుగం విషయానికి వస్తే, శ్రీకృష్ణుడిగా శ్రీమహావిష్ణువు అవతరించాడు. ఎనిమిది లక్షల 64 వేల సంవత్సరాలు ఈ కాల పరిమాణం. చంద్రుడు రాజుగా, మంత్రిగా బుధుడు ఉన్నారు. చంద్రుడికి, బుధుడుకి ఒకరంటే ఒకరికి పడదు. దేవతా కార్యాలని సగానికి సగం నాశనం చేశారు.

ఇలా ద్వాపరయుగంలో ధర్మం రెండు భాగాలుగా నశించి, కలియుగం వచ్చింది. కలియుగం కాలపరిమితి నాలుగు లక్షల 32000 సంవత్సరాలు. సుమారు 5000 సంవత్సరాలు గడిచిపోయాయి. కలియుగానికి రాజు శని, మంత్రులు రాహు కేతువులు. మంత్రులు ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు. రాహువు శనికి మిత్రుడు. కలియుగంలో అసత్యం, క్రూరత్వం, అధర్మం, అన్యాయం తలెత్తుతాయి. దైవభక్తి తగ్గుతుంది. హింస సిద్ధాంతాలు పెరుగుతాయి. పాపం వల్ల దుఃఖం అనుభవిస్తాం అనే భయం పోతుంది. స్త్రీని, ధనాన్ని పొందిన వాడే గొప్పవాడని అనుకునే రోజులు వస్తాయి. అధర్మం బాగా పెరుగుతుంది. కలియుగంలో మంచి అనే మాటకి చోటే ఉండదు. అధర్మం వైపు అందరూ ఆసక్తి చూపుతారు అని శివపురాణం లో చెప్పబడింది.

Share
Sravya sree

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM