వినాయక చవితి రోజు సహజంగానే భక్తులు ఇళ్లలో వినాయకుడి ప్రతిమలను పెట్టి పూజిస్తుంటారు. అయితే కింద చెప్పిన విధంగా వినాయకున్ని పూజించడం వల్ల అన్ని రకాల సమస్యలు పోతాయి. సకల సంపదలు కలుగుతాయి. మరి అందుకు ఏం చేయాలంటే..
విద్య, వివాహం, గృహ నిర్మాణం, అప్పుల బాధ, అనారోగ్య సమస్యలు, ఇతరత్రా గ్రహ దోషాలు ఉన్నవారు వినాయక చవితి రోజు ఆయనకు ముడుపు కట్టండి. సంకల్పం చేసుకోండి. మీ ఈతి బాధలను విఘ్నేశ్వరుడు తొలగిస్తాడు.
వినాయక చవితి రోజు ఒక తెల్లని వస్త్రంలో కిలోంపావు బియ్యం, బెల్లం ముక్క, పసుపు, కుంకుమ, ఎండు కొబ్బరి కుడుక, 11 రూపాయలు పెట్టి మూట కట్టాలి. గణపతి పూజ చేసి సంకల్పం చేయాలి. మీ గోత్ర నామాదులు, కుటుంబ సభ్యుల పేర్లు చెప్పుకుని, మీ బాధలు, కష్టాలు చెప్పుకుని తీర్చమని వేడుకుని వినాయకుని నామాలను 108 సార్లు జపించి కొబ్బరికాయ కొట్టాలి. తరువాత 41 రోజుల్లో మీరు కోరుకున్నవి నెరవేరుతాయి.
మీరు కోరినవి నెరవేరిన తరువాత ఆ ముడుపును మీ దగ్గరలో ఉన్న గణపతి దేవాలయంలో ఇచ్చి ఉండ్రాళ్లతో అర్చన చేసి ప్రసాదాన్ని అందరికీ పంచాలి. ఇలా మొక్కు తీర్చుకోవాలి.