తెలంగాణ రాష్ట్రంలో సైదాబాద్ లో చోటు చేసుకున్న చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం విదితమే. జాతీయ మీడియా సంస్థలు కూడా ఈ ఘటనపై ప్రత్యేకంగా వార్తలను ప్రసారం చేశాయి. అయితే ఆ చిన్నారిపై అంతటి దారుణానికి పాల్పడిన రాజు అనే నిందితుడు చనిపోయాడు. రైల్వే ట్రాక్ మీద అతని మృత దేహం కనిపించింది. అతని చేతిపై ఉన్న పచ్చ బొట్టు ఆధారంగా అతను రాజు అని పోలీసులు నిర్దారించారు.
రాజు కోసం ఓ వైపు రాష్ట్రం మొత్తం పోలీసులు జల్లెడ పట్టారు. ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే అతను తాజాగా ఉప్పల్ సమీపంలో కనిపించినట్లు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిర్దారించారు. అయితే అతని మృత దేహం స్టేషన్ ఘన్పూర్ రైల్వే ట్రాక్పై కనిపించింది. ప్రజలు అతన్ని చుట్టు ముట్టడంతో తీవ్ర ఆందోళనకు గురైన అతను రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
నిందితుడు రాజుపై ఇప్పటికే రూ.10 లక్షల రివార్డును ప్రకటించారు. అతన్ని పట్టిస్తే ఆ మొత్తం ఇస్తామని తెలిపారు. కానీ అతను రైల్వే ట్రాక్పై చనిపోయి కనిపించడం సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనపై పోలీసులు మరికాసేపట్లో ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…