మహిళలపై దేశంలో రోజు రోజుకీ వేధింపులు పెరిగిపోతున్నాయి. కొందరు శాడిస్టు భర్తలు చిన్న విషయాలకే తమ భార్యలపై దాడి చేస్తున్నారు. కొందరైతే ఏకంగా తమ భార్యలను హతమారుస్తున్నారు. మధ్యప్రదేశ్ లోనూ సరిగ్గా ఇలాంటిదే ఓ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్ లోని భోపాల్లో ఉన్న గౌతమ్ నగర్కు చెందిన సమీర్, షబ్నమ్ ఖాన్ (35)లు దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. షబ్నమ్ ఇంటికి సమీపంలోనే ఆమె తల్లిదండ్రులు నివాసం ఉంటున్నారు. అయితే ఆమె పుట్టింటికి వెళ్లే విషయమై భర్తను అడిగింది. కానీ అందుకు సమీర్ ఒప్పుకోలేదు.
ఈ క్రమంలోనే భార్యా భర్త మధ్య గొడవ పెరిగింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన సమీర్ రాత్రి 11 గంటల సమయంలో భార్యపై కిరోసిన్ పోసి నిప్పు పెట్టాడు. అనంతరం అతను ఇంటి నుంచి పారిపోయాడు.
తరువాత ఆమె పెద్దగా కేకలు వేయడంతో నిద్ర లేచిన ఆమె పెద్ద కుమారుడు ఇరుగు పొరుగు వారికి, తన అమ్మమ్మ, తాతలకు సమాచారం ఇచ్చాడు. దీంతో వారు అక్కడికి చేరుకుని తమ కుమార్తెను హాస్పిటల్కు తరలించారు. ఆమె పరిస్థితి ప్రస్తుతం 35 శాతం కాలిన గాయాలతో అత్యంత విషమంగా ఉంది. ఈ మేరకు సమీర్పై కేసు నమోదు చేసిన పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…
నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ . ఆయన…