చెన్నైలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. కూల్ డ్రింక్ తాగిన ఓ బాలిక రక్తంలో కూడిన వాంతులు చేసుకుంది. తరువాత ఆమె వెంటనే చనిపోయింది. ఆమె శరీరం మొత్తం నీలి రంగులోకి మారిపోయింది. వివరాల్లోకి వెళితే..
చెన్నైలోని బీసెంట్ నగర్ లో స్థానిక కిరాణా దుకాణం నుండి 13 ఏళ్ల బాలిక ధరణి ఓ కూల్ డ్రింక్ను కొనుగోలు చేసింది. అనంతరం ఆ కూల్ డ్రింక్ను ఆమె తాగింది. అయితే ఆమె కూల్డ్రింక్ తాగాక ఆమెకు రక్తంతో కూడిన వాంతులు అయ్యాయి.
ఈ క్రమంలో ఆమె అక్క అశ్విని తమ తల్లిదండ్రులను ఇంటికి తిరిగి రమ్మని పిలిచింది. ధరణిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. వారు ఆసుపత్రికి చేరుకునే సమయానికి ధరణి శరీరం మొత్తం నీలం రంగులోకి మారింది.
ఈ సంఘటన తర్వాత ఆహార భద్రత అధికారులు తాత్కాలికంగా చెన్నైలోని శీతల పానీయాల తయారీ యూనిట్ను మూసివేశారు. తదుపరి నోటీసు వచ్చేవరకు యూనిట్ మూసివేయబడుతుందని తెలిపారు.
కాగా వివిధ దుకాణాలకు పంపిన ఒకే బ్యాచ్ కూల్ డ్రింక్ సీసాలు 540 ఉంటే వాటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. షాపుల నుండి బ్యాచ్ను అధికారులు రీకాల్ చేసే సమయానికి చెన్నై అంతటా 17 సీసాలు అమ్ముడయ్యాయి. బీసెంట్ నగర్ నివాసితులు తమ పరిసరాల్లో విక్రయించే ఉత్పత్తుల నాణ్యతను తనిఖీ చేయాలని ఆహార భద్రతా అధికారులను డిమాండ్ చేశారు.
కాగా ధరణికి ఆస్తమా ఉంది. ఆమెను కూల్ డ్రింక్స్ తాగకూడదని వైద్యులు చెప్పారు. ఈ వివరాలను పోలీసులు తెలిపారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాయపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్ట్మార్టం నివేదికలో, పానీయం ఆమె శ్వాసకోశ వ్యవస్థలోకి ప్రవేశించిన తర్వాత ఊపిరాడకపోవడమే మరణానికి కారణమని చెప్పబడింది.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పానీయం నమూనాలను ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపినట్లు పోలీసులు తెలియజేశారు. షోలవరంలోని తయారీ యూనిట్ అధికారులను త్వరలో ప్రశ్నించనున్నారు.
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…
నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ . ఆయన…