కడుపున పుట్టినబిడ్డ అన్న మమకారం లేకుండా 22 రోజుల పసిగుడ్డుపై ఓ తండ్రి తన పైశాచికత్వాన్ని చూపించాడు. తాగిన మత్తులో తన బిడ్డ, తన భార్యపై విచక్షణారహితంగా దాడి చేయడంతో ఆ చిన్నారి మృతి చెందిన ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది. పూర్తి వివరాలలోకి వెళితే..
సైదాబాద్ పరిధిలోని పూసల బస్తీలో తాగిన మైకంలో రాజేష్ అనే వ్యక్తి తన భార్య జాహ్నవి, 22 రోజుల చిన్నారిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ క్రమంలోనే పసిబిడ్డకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. తన భర్త తాగొచ్చాడన్న కారణంగా వీరిద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తి చివరికి చిన్నారి ప్రాణాల మీదకు తీసుకువచ్చారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి మృతి చెందడంతో పోలీసులు రాజేష్ అలియాస్ రాజును కస్టడీలోకి తీసుకున్నారు. అయితే మృతి చెందిన చిన్నారి వీరికి రెండో సంతానం కాగా మొదటి సంతానం ఒక బాబు పుట్టగా బాబు ఐదు నెలల వయసులో ఉన్నప్పుడు రాజు తాగొచ్చి ఆ బాలుడిని ఇంటి నుంచి బయటకు విసిరాడు. ఈ క్రమంలోనే ఆ బాలుడిని సంరక్షణకోసం యూసఫ్ గూడలోని శిశు విహార్ లో చేర్చారు. కాగా రెండవ సంతానం కూడా ఈ విధంగా వారి మధ్య ఘర్షణలకు బలైపోయాడని స్థానికులు తెలిపారు.
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…
నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ . ఆయన…