సాధారణంగా మన టాలీవుడ్ ఇండస్ట్రీ హీరోలు ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు బిజినెస్ లు చేస్తుంటారు. ఈ విధంగా ఎంతో మంది బిజినెస్ లో సక్సెస్ అవుతుంటే మరికొంతమంది పెద్ద ఎత్తున మోసపోయిన వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో సీనియర్ నటుడు నరేష్ కూడా ఒకరు.బిజినెస్ విషయంలో కీస్టోస్ కంపెనీ రూ.7.5 కోట్లు మోసం చేసిందని సీనియర్ నటుడు నరేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
లింగం శ్రీనివాస్ అనే వ్యక్తి కీస్టోన్ ఇన్ఫా కంపెనీల పేరుతో తమ బిల్డర్స్తో ఫినిక్స్లో అసోసియేట్ అయి సైనింగ్ అథారిటీగా ఉన్నాడని, తన కుటుంబంతో ఎన్నో ఏళ్లుగా పరిచయం ఉండడంతో 7.5 కోట్లు హ్యాండ్ ఫైనాన్స్ ద్వారా తీసుకుని తిరిగి ఇవ్వలేదని నరేష్ ఫిర్యాదులో పేర్కొన్నాడు.
తన దగ్గర నుంచి తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందిగా గత ఆరు సంవత్సరాల నుంచి అడుగుతున్నప్పటికీ పట్టించుకోవడంలేదు అందుకే సెంట్రల్ క్రైమ్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని, ఈ విధంగా తనని మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నరేష్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…