టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా స్టార్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ కి అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే చాలామంది అమ్మాయిలు ప్రభాస్ లాంటి భర్త రావాలని కోరుకుంటారు. కేవలం అమ్మాయిలు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు సైతం ప్రభాస్ అంటే విపరీతమైన అభిమానం ఇష్టాన్ని పెంచుకున్న వారు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే ఏకంగా ఒక హీరోయిన్ ప్రభాస్ ని పెళ్లి చేసుకుంటానని చెప్పడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన చిత్రం నేనొక్కడినే. ఇందులో మహేష్ బాబు సరసన కృతి సనన్ ఆడిపాడింది. అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయినప్పటికీ ఆ తర్వాత నాగచైతన్య సరసన దోచేయ్ సినిమాలో నటించింది కృతిసనన్. ఈ సినిమా కూడా ఆమెను తీవ్ర నిరాశ పరచడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి స్వస్తి చెబుతూ బాలీవుడ్ వైపు అడుగులు వేసింది.
ఈ క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు దక్కించుకుని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈమె ప్రస్తుతం ప్రభాస్ “ఆదిపురుష్”చిత్రంలో సీత పాత్రలో నటిస్తోంది. ఈ సందర్భంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో భాగంగా కృతిసనన్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ప్రభాస్, కార్తీక్ ఆర్యన్, టైగర్ ష్రాఫ్లో మీరు పెళ్లి చేసుకోవాలని భావిస్తే ఎవరిని చేసుకుంటారని అడగగా.. అందుకు ఆమె ఏ మాత్రం ఆలోచించకుండా ప్రభాస్ ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పడం ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఎవరితో డేట్ చేస్తారని అడగగా.. టైగర్ ష్రాఫ్ అని సమాధానం చెప్పిన ఈ బ్యూటీ కార్తీక్ ఆర్యన్ ను ఫ్లర్ట్ చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసింది.