ఇటు తెలుగులోనే కాదు అటు హిందీలోనూ కియారా అద్వానీ ఎన్నో అవకాశాలను అందుకుంటోంది. అందులో భాగంగానే హిందీలో ఆమె నటించిన షేర్షా మూవీ ట్రైలర్ తాజాగా లాంచ్ అయింది. అందులో సిద్ధార్థ్ మల్హోత్రా పక్కన కియారా అద్వానీ నటిస్తోంది. ఈ క్రమంలోనే ట్రైలర్ లాంచ్ సందర్బంగా కియారా తెలుపు రంగు ఎంబ్రాయిడరీ చీరలో సందడి చేసింది.
ఈ మూవీలో కియారా డింపుల్ కీమా పాత్రలో నటిస్తోంది. సిద్ధార్థ మల్హోత్రా కెప్టెన్ విక్రమ్ బాత్రా పాత్రను పోషిస్తున్నాడు. కరణ్ జోహార్ ఈ మూవీని తెరకెక్కించారు. మనీషీ కి చెందిన ప్రేమ్యా బ్రాండ్ చీరను కియారా ధరించింది. అది ఐవరీ వైట్ శారీ. దాని ధర రూ.66వేలు.
కియారా అద్వానా ఎయిర్పోర్టు లుక్స్లోనే కాదు రెడ్ కార్పెట్స్లోనూ అందంగా కనిపించడంలో ముందు ఉంటుంది. అందులో భాగంగానే ఆమె తాజాగా ధరించిన చీర అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక కియారా అద్వానీ త్వరలో భూల్ భులయ్యా 2 అనే మూవీలో కనిపించనుంది. ఆమె చివరిగా ఇండో కి జవానీ అనే మూవీలో నటించింది.