బుల్లితెరపై ప్రతివారం ప్రసారమయ్యే ఎన్నో కార్యక్రమాలలో ” ఢీ” కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన. ఈ కార్యక్రమానికి గతంలో శేఖర్ మాస్టర్ జడ్జి గా వ్యవహరించేవారు. ప్రస్తుతం ప్రియమణి, పూర్ణ, గణేష్ మాస్టర్ జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు.ఇక ఈ కార్యక్రమానికి యాంకర్ గా ప్రదీప్ వ్యవహరించగా ఈ కార్యక్రమంలో సుడిగాలిసుధీర్ ,రష్మిక ,దీపికా, హైపర్ ఆది మొదలైన వారు ఈ కార్యక్రమం ద్వారా ఎంతో సందడి చేస్తారు. ఇక ఈ వారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ ప్రోమోలో భాగంగా అరుంధతి సినిమాలో అరుంధతి గా పూర్ణ, ప్రియమణి మిత్రవింద, ఏం మాయ చేసావే జెస్సికా రష్మి, సుధీర్ ఇంద్ర, గణేష్ మాస్టర్ జానీ మాస్టర్ గా, హైపర్ ఆది కాలభైరవగా నటించారు.ఈ ఎపిసోడ్ లో కూడా పలువురు స్టార్ సెలబ్రిటీల ఫర్ఫార్మెన్స్ లను చేయబోతున్నారు. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన “వకీల్ సాబ్” చిత్రంలోని జనగణమన పాటకు డాన్సర్లు చేసిన పర్ఫామెన్స్ చూసి అందరూ బావోద్వేగం అయ్యారు.
ఈ పాటలో ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి ఎంతో అద్భుతంగా వివరించడంతో గణేష్ మాస్టర్ చాలా ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ ఆగస్టు 11న ప్రసారం కాబోతుంది.