ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ అభ్యర్థులకు ఫైనాన్షియల్ కార్పొరేషన్ శుభవార్తను తెలియజేసింది. ఫైనాన్షియల్ కార్పొరేషన్ లో వివిధ భాగాలలో ఖాళీగా ఉన్న 23 ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఖాళీగా ఉన్న మేనేజర్, డిప్యూటీ మేనేజర్లు, అసిస్టెంట్ మేనేజర్ ల పోస్టులను భర్తీ చేయనుంది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ కూడా ప్రారంభమైంది.
ఈ ఉద్యోగాలకు ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు పోస్టును బట్టి వివిధ విద్యార్హతలు ఉంటాయి. ఇకపోతే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఆగస్ట్ 1, 2021 తేదీకి అభ్యర్థుల వయస్సు 21 నుంచి 34 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఈ ఉద్యోగాలకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా చేయాల్సి ఉంటుంది. జనరల్, బీసీ అభ్యర్థులు పరీక్ష రుసుము 1003 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అదే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 590 రూపాయల పరీక్ష రుసుం చెల్లించాలి. అభ్యర్థులను ఆన్ లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. సెప్టెంబర్ 16వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాగా అక్టోబర్ 10వ తేదీ దరఖాస్తుల స్వీకరణకు గడువు ఉంది. ఈ నోటిఫికేషన్ గురించి మరింత సమాచారం కోసం అభ్యర్థులు https://esfc.ap.gov.in అనే వెబ్సైట్ను సందర్శించవచ్చు.