మొబైల్స్ తయారీ సంస్థ వివో.. వై33ఎస్ పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్ను భారత్లో విడుదల చేసింది. ఇందులో 6.58 ఇంచుల ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన డిస్ప్లేను ఏర్పాటు చేశారు. మీడియాటెక్ హీలియో జి80 ప్రాసెసర్ లభిస్తోంది. 8 జీబీ ర్యామ్ను అందిస్తున్నారు. అవసరం అనుకుంటే ర్యామ్ను ఇంకో 4జీబీ వరకు పెంచుకోవచ్చు.
ఈ ఫోన్లో వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉంది. దీనికి తోడు మరో 2 మెగాపిక్సల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సల్ మాక్రో ట్రిపుల్ కెమెరాలు ఉన్నాయి. ముందు వైపు 16 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ పక్క వైపున ఉంది. దీంతో ఫోన్ను కేవలం 0.24 సెకన్ల వ్యవధిలోనే అన్లాక్ చేయవచ్చు.
ఈ ఫోన్లో ఆండ్రాయిడ్ 11 ఓఎస్ లభిస్తుంది. మల్టీ టర్బో 5.0, అల్ట్రా గేమ్ మోడ్ ఫీచర్లను గేమ్స్ ఆడే వారి కోసం అందిస్తున్నారు. ఈ ఫోన్లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా, దీనికి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ లభిస్తోంది.
128 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్బీ టైప్ సి వంటి ఇతర ఫీచర్లు ఈ ఫోన్లో అందుబాటులో ఉన్నాయి.
వివో వై33ఎస్ స్మార్ట్ ఫోన్ ధర రూ.17,990గా ఉంది. వివో ఆన్లైన్ స్టోర్తోపాటు అమెజాన్, ఫ్లిప్కార్ట్ సైట్లలో, అన్ని రిటెయిల్ స్టోర్స్లో ఈ ఫోన్ను విక్రయిస్తున్నారు.