మంచు లక్ష్మీ ప్రసన్న నటిగా నిర్మాతగా అందరికీ సుపరిచితమే. లక్ష్మీ మంచు ఇదివరకే ఎన్నో టాక్ షోలను నిర్వహించింది. ఇక తాజాగా ఈమె “ఆహా భోజనంబు” అనే కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమం ఓటీటీ వేదిక అయినటువంటి ఆహా యాప్ ద్వారా ప్రసారమవుతుంది. ఈ యాప్ ద్వారా ఇదివరకే ఎన్నో టాక్ షోలు, వెబ్ సిరీస్ లు, సినిమా ప్రేక్షకులను సందడి చేస్తోంది.
తాజాగా మంచు లక్ష్మి “ఆహా భోజనంబు”అనే కార్యక్రమం ద్వారా సందడి చేస్తున్నారు.ఇప్పటికే ఈ కార్యక్రమం రెండు ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. హీరో విశ్వక్ సేన్, హీరోయిన్ రకుల్ ప్రీతి ఈ కార్యక్రమానికి వచ్చి తమదైన శైలిలో వంటలు చేస్తూ వినోదాన్ని పంచారు. తాజాగా ఈ కార్యక్రమానికి దర్శకుడు తరుణ్ భాస్కర్ వచ్చారు.
“ఆహా భోజనంబు” భోజన కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్ తరుణ్ భాస్కర్ వంటను వండి అనేక విషయాలను ఎంతో సరదాగా ముచ్చటించారు.తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను ఆహా సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ ఆగస్ట్ 6న ప్రసారం కానుంది. ఇకపోతే ఈ కార్యక్రమానికి అఖిల్, మంచు విష్ణు, విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోలు సైతం రానున్నట్లు సమాచారం.