ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా డెవలప్ కావడంతో సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి చిన్న విషయాన్ని, ప్రతి చిన్న తప్పును వేలెత్తి చూపించే పరిస్థితులు ఏర్పడ్డాయి. అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా ఎన్నో సమస్యలకు పరిష్కారమైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా నటి నివేదా పేతురాజ్కు ఓ చేదు అనుభవం ఎదురైంది.
తాజాగా నటి ఆన్లైన్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసింది. ఆర్డర్ చేసినప్పుడు ఇంటికి రాగానే దాన్ని తెరిచి చూడగానే ఆమె ఎంతో షాక్ అయింది. తను ఆర్డర్ చేసుకున్న ఫుడ్డులో బొద్దింక కనిపించడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఈ బ్యూటీ సోషల్ మీడియా వేదికగా హోటల్ బండారాన్ని బయట పెట్టేసింది. అదేవిధంగా ఇలాంటి ఫుడ్ డెలివరి చేసిన స్విగ్గి సంస్థను కూడా ఏకిపారేసింది.
ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ చెప్పడంతో ఈ విషయం ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.
ఈ క్రమంలోనే ఈమె చేసిన పోస్టులు చూసిన పలువురు నెటిజన్లు ఇలాంటి సందర్భాలు ఇంతకు మునుపు తమకు ఎదురయ్యాయి అంటూ స్పందించారు. ఈ క్రమంలోనే ఈ వీడియో ఫుడ్ సేఫ్టీ అధికారుల దృష్టిలోకి పడటంతో వెంటనే రంగంలోకి దిగి హోటల్ పై దాడి చేయగా అధికారులు ఖంగుతిన్న విషయాలు బయటపడ్డాయి. ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడిలో భాగంగా హోటల్లో అధిక మొత్తం కుళ్ళిన మాంసం ఉన్నట్లు తెలియజేయడంతో హోటల్ పై చర్యలు తీసుకున్నారు. ఈ విధంగా నివేదా చేసిన పోస్ట్ హోటల్ బాగోతాన్ని బయట పెట్టింది.