Janhvi Kapoor : శ్రీదేవి కూతురుగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటికీ జాన్వీ కపూర్ తన నటనతో గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఎప్పటికప్పుడు ఈమె టూర్లు వేస్తూ ఆ ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తుంటుంది. తాజాగా తన సోదరి ఖుషీ కపూర్ 21 సంవత్సరాలు నిండిన సందర్భంగా బర్త్ డేను సెలబ్రేట్ చేసుకుంది. దీంతో ఆ పార్టీలో జాన్వీ కపూర్ మెరిసిపోయింది.
ఖుషీ కపూర్ బర్త్ డే పార్టీలో జాన్వీ కపూర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పింక్ కలర్ డ్రెస్ ధరించి అందరి మతులను పోగొడుతోంది. ఎక్కడికక్కడ అందాలను ఆరబోస్తూ ఆమె ఫొటోలకు పోజులిచ్చింది. దీంతో ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ పార్టీకి వారి స్నేహితులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఖుషీ నిక్నేమ్ను కూడా జాన్వీ రివీల్ చేసింది. అందరూ ఆమెను లడ్డూ బేబీ అంటారట. అదే కాప్షన్తో ఆ ఫొటోలను జాన్వీ కపూర్ షేర్ చేసింది.
ఇక జాన్వీ కపూర్ ఫొటోలను చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. బార్బీ డాల్లా ఉన్నావంటూ కితాబిస్తున్నారు.
ఈ పార్టీకి అంజిని ధావన్, భూమీ పెడ్నెకర్, సమీక్షా పెడ్నెకర్, అగస్త్య నంద వంటి వారు హాజరయ్యారు. చూస్తుంటే రూఫ్ టాప్ మీద చాలా గ్రాండ్గా పార్టీని సెలబ్రేట్ చేసినట్లు అర్థమవుతుంది.