Shriya Saran : నటి శ్రియా శరన్ తాజాగా అందరికీ సడెన్ గా సర్ప్రైజ్ను ఇచ్చిన విషయం విదితమే. లాక్ డౌన్ సమయంలో తాను బిడ్డను కన్నానని.. తన కుమార్తెను శ్రియ ప్రపంచానికి పరిచయం చేసింది. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఓ ఇంగ్లిష్ మీడియా చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రియ తన కుమార్తె గురించిన వివరాలను వెల్లడించింది.
తన భర్త ఆండ్రె కొశ్చీవ్ లాక్ డౌన్ సమయంలో బిడ్డను కందామని చెప్పాడని.. అందుకనే అది సరైన సమయం అని భావించి తాను బిడ్డను కన్నానని శ్రియ తెలిపింది. అయితే తన కుమార్తెకు రాధ అని నామకరణం చేసినట్లు శ్రియ వెల్లడించింది. రాధ అని పేరు పెట్టడంపై తన భర్త కూడా ఎంతో సంతోషించాడని శ్రియ తెలిపింది.
రాధకు ప్రస్తుతం 9 నెలల వయస్సు కాగా.. ఆమె ఇప్పటికే అనేక దేశాలు తిరిగిందని శ్రియ చెప్పుకొచ్చింది. ఇక రాధ బార్సిలోనాలో పుట్టిందని, తన తల్లి ఇండియాలో ఉందని.. అన్ని రకాలుగా తనకు అండగా ఉంటుందని తెలిపింది. కాగా శ్రియ తదుపరి సినిమాలు అయిన ట్రిపుల్ ఆర్, గమనం, ఎ మ్యూజికల్ స్కూల్లలో కనిపించనుంది.